– అరెల్లి మల్లేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు
శుక్రవారం రోజు ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 11స్టోన్ క్రషర్ 16 క్వారీలు నడుస్తున్నట్లు నివేదికలో అధికారులు చెబుతున్న వీటికి సరైనటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా పొల్యూషన్ మరియు, సిఈ, సిఈఫ్, సిప్, ఈ రకమైనటువంటి గైడ్లైన్స్ లేకుండా ఇష్టరాజ్యంగా నడుపుతూ సహజ వనరులను సర్వనాశనం చేయడం కోసం మాఫీయా ముఠా లాగా గా నడుపుతున్న యజమాన్యాలపై మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందారు.. ఈనెల 16న పిప్పరి శ్రీకృష్ణ క్రసర్ యజమాన్యం నిర్లక్ష్యం సతీష్ గడ్ రాష్ట్రం కు చెందిన కూలీ పని చేసుకునే వారి 12 ఏళ్ల బిడ్డ దుర్మరణం చెందింది ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు స్పష్టంగా అనుమతులు లేకుండా గడువు ముగిసినా కూడా నడిపిన యజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూ పూర్తిగా విఫలం చెందారు.
ఈరోజు తలమడుగు మండల పరిధిలో తిరుమల కన్స్ట్రక్షన్స్ వారి నిర్లక్ష్యం వల్ల అక్కడ కూలి పని చేసుకునే 24 సంవత్సరాల మహేందర్ చనిపోవడం జరిగింది.. ఇలా వరుస మరణాలు సంభవిస్తున్న అరికట్టడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలం చెందడం సిగ్గుచేటు అని ఎమ్మార్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.. జిల్లావ్యాప్తంగా ఈ క్రషర్ క్వారీల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి త్వరలో ఫిర్యాదు చేస్తామని సహజ వనరులను కాపాడుకునేందుకు ఎంతటి పోరాడానికైనా సిద్ధమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.. చనిపోయిన కార్మికుల కుటుంబాల ను ఆదుకునేంతవరకు ఎమ్మార్పీఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు దుబ్బాక సుభాష్ మాదిగ, సిరిసిల్ల భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి జన్నారపు సాయి మాదిగ, మండల అధ్యక్షులు చిట్టి రవి మాదిగ, పట్టణ అధ్యక్షులు చందు మాదిగ, సుంకె అనిల్ మాదిగ, సాయి మాదిగ ,నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments