హైదరాబాద్,(రిపబ్లిక్ హిందుస్థాన్ ) : శ్రీ రామ నవమి సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని మహంకాళి టెంపుల్ హౌసింగ్ బోర్డు కాలనీ తట్టానారం లో కన్నుల పండగల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతమ్మ పెళ్లికూతురు చేసి రామయ్యలను పెళ్ళికొడుకు తయారుచేసి పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారామ కళ్యాణానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సీతారామ కళ్యాణనికి ముందు రామయ్యను సీతమ్మను పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా తయారుచేసి ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా పెళ్లి మంత్రాలతో నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమంలో శివకుమార్ శైలజ ల దంపతులు సీతమ్మ, రాముల వారి విగ్రహాలను తీసుకువచ్చారు. గత కొంతకాలంగా వీరి ఆధ్వర్యంలోనే కళ్యాణం జరగటం ఆనవాయితీగా వస్తుంది. సీతమ్మ రాముల వారి కళ్యాణ అనంతరం సహా పనికి భోజనాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో
ప్రిథ్విజ , జయశ్రీ రాజయ్య కోమల తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments