republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 February 2023, 2:28 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు

రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (ఫిబ్రవరి 19) : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి అక్కడ ప్రజలకు వివరిస్తున్నటు వంటి సందర్భాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక ఒక మహిళ అని చూడకుండా వైయస్ షర్మిలను అరెస్టు చేశారని  వైయస్సార్ టిపి లక్సెట్టిపేట టౌన్ ప్రెసిడెంట్ ఎండీ సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజులలో అక్రమంగా అరెస్టులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని అన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!