republichindustan.in
Newspaper Banner
Date of Publish : 20 October 2022, 7:04 am Digital Edition : REPUBLIC HINDUSTAN

Breaking News : ఇచ్చోడ మండలం లో మత్తు ఇంజెక్షన్ కలకలం…

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ :
హరినాయక్ తాండా గ్రామంలో బస్టాండ్ లో నిల్చోని ఉన్న శ్రీకాంత్ (22) అనే యువకుడికి గుర్తు తెలియని ఇంజెక్షన్ పొడిచి పరారైన గుర్తుతెలియని వ్యక్తి.

బైక్ పై వచ్చి ఇంజెక్షన్ పొడిచి వెల్లిపోయినా గుర్తుతెలియని వ్యక్తి పరారైనట్లు సమాచారం.

ఇంజెక్షన్ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు . అచేతనంగా పడి ఉన్న యువకుడిని చూసి 108 కు సమాచారమిచ్చిన స్థానికులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన 108 సిబ్బంది మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు తరలించారు. శ్రీకాంత్ ప్రస్తుతం రిమ్స్ లో కోలుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఇచ్చోడా నుండి నర్సాపూర్ వైపు వెళ్లి, అతనికి మత్తు మందు ఇంజక్షన్ ఎందుకు ఇచ్చినట్లు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.