republichindustan.in
Newspaper Banner
Date of Publish : 28 March 2024, 8:49 am Digital Edition : REPUBLIC HINDUSTAN

భర్తను కొట్టి చంపిన భార్య…

కరీంనగర్ జిల్లా మార్చి 28
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఈరోజు దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది.

రోజు తాగి వచ్చితరచు గొడవ చేస్తున్నాడని నెపంతో భర్త హేమంత్ ని చంపింది భార్య రోహితి. పడుకున్న భర్త పై వేడి నీళ్ళు పోసిన భార్య రోహితి….

అనంతరం కొట్టడంతో తీవ్ర గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చేరిన తర్వాత భర్త హేమంత్ చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతిచెందాడు.

కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తోంది రోహితి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు.