ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నర్ మండలం కొల్హారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి రిమ్స్ లో చికిత్స పొందుతున్నా భార్య మృతి చెందిన వార్త విని ఆసుపత్రి అవరణంలోనే పురుగున మందు తాగి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటచేసుకుంది…
Thank you for reading this post, don't forget to subscribe!
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

కుటుంబ కలహాలతో భార్య భర్తల ఆత్మహత్య?
ఆదిలాబాద్ జిల్లా: జనవరి 27
ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి ముందు పురుగుల మందు తాగింది. భార్యమరణం తట్టుకోలేక భర్త విజయ్ కూడా పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే విజయ్ మరణించాడు.
గతేడాది మేలో పల్లవి, విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు…..