republichindustan.in
Newspaper Banner
Date of Publish : 29 August 2024, 2:07 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

రిపబ్లిక్ హిందూస్థాన్,  బజార్ హత్నూర్ :

బజార్ హత్నూర్ మండలం లోని కడెం బ్రిడ్జి వద్ద మండల పోలీసులు   గురువారం రోజు వాహనాలను తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్,త్రిబుల్ రైడింగ్,అలాగే వాహనాల దృవ పత్రాలు పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే అలాగే , వాహనాల దృవ పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు.
మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ఇస్తే వాహన యజమాని పై చట్ట పరమైన
చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీలో ఎస్ఐ జి.అప్పారావ్,హెడ్ కానిస్టేబుల్ మోహన్, కానిస్టేబుల్ కిషన్,హోమ్ గార్డ్స్ ఉన్నారు.