republichindustan.in
Newspaper Banner
Date of Publish : 29 August 2024, 2:07 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

రిపబ్లిక్ హిందూస్థాన్,  బజార్ హత్నూర్ :

బజార్ హత్నూర్ మండలం లోని కడెం బ్రిడ్జి వద్ద మండల పోలీసులు   గురువారం రోజు వాహనాలను తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్,త్రిబుల్ రైడింగ్,అలాగే వాహనాల దృవ పత్రాలు పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే అలాగే , వాహనాల దృవ పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు.
మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ఇస్తే వాహన యజమాని పై చట్ట పరమైన
చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీలో ఎస్ఐ జి.అప్పారావ్,హెడ్ కానిస్టేబుల్ మోహన్, కానిస్టేబుల్ కిషన్,హోమ్ గార్డ్స్ ఉన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!