రామకృష్ణాపూర్ జనవరి 17 (రిపబ్లిక్ హిందుస్థాన్)
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన కూడలలో వాహన తనికీలు నిర్వహించారు. సరైన పత్రములు లేని వాహనములకు పట్టణ ఎస్సై బి .అశోక్ జరిమానాలు విధించారు.ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని,వాహనములు వేగం మించి నడపరాదని అలాగే మద్యం సేవించి వాహనాలని నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.