రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ : ఇచ్చోడ మండలం లోని కామ గిరి గ్రామంలో లో గురువారం రోజున ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన దేవల సంతోష్ గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. గతంలో లో ఈ గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు పొందిన రెండు సంవత్సరాల క్రితం బదిలీపై వెళ్లిన ఈ ఏడాదిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేకంగా సంతోషం సన్మానించారు . ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య విద్యార్థుల భవిష్యత్తుకు పునాది కావున విద్యార్థులు ఈ దశలో స్మార్ట్ఫోన్లు లకు దూరంగా ఉండాలని చదువుపై దృష్టి పెట్టాలని ఆటల పై దృష్టి పెట్టాలని అన్నారు. బదిలీపై వెళ్లిన తన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని ప్రత్యేక రామగిరి గ్రామానికి జీవితాంతం రుణపడి ఉంటాను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భీమ్రావు విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మణ్ మాజీ చైర్మన్ పోతా రెడ్డి గ్రామ యువజన సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అతడితో పాటు గ్రామ పెద్దలు రమణయ్య శైలేందర్ గోవర్ధన్ రెడ్డి జ్ఞానేశ్వర్ నాతోపాటు పూర్వ విద్యార్థుల తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు మాట్లాడుతూ మాట్లాడుతూ గతంలో తమ పాఠశాల ఎవరూ పట్టించుకోలేదని సంతోష్ తమ పాఠశాలకు గుర్తింపు వచ్చిందని విద్యార్థులకు చదువుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!