republichindustan.in
Newspaper Banner
Date of Publish : 23 November 2021, 3:03 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

తగ్ ఆఫ్ వార్ ఆటలో నేషనల్ కి ఎంపికైన అడ్డగూడూర్ ఆణిముత్యాలు రితిక, సాత్వికలు…

రిపబ్లిక్ హిందుస్థాన్, అడ్డగుడూర్ :

నేటి నుండి నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలోని పల్గర్ పట్టణంలో జరుగు తగ్ ఆఫ్ వార్ నేషనల్ క్రీడలలో పాల్గొనేందుకు తెలంగాణ జట్టు తరుపున మన అడ్డగూడూర్ మండల కేంద్రానికి చెందిన గూడెపు రితిక తండ్రి బాబు అండర్ 13 టు 15 కు ఎంపీకయ్యారు.కక్కిరేణి సాత్విక అండర్ 19 కు ఎంపీకయ్యారని తగ్ ఆఫ్ వార్ తెలంగాణ కోచ్ యాదగిరి మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో తెలిపారు.అనంతరం కోచ్ యాదగిరి మాట్లాడుతూ… పిల్లల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో మేలు చేస్తానని క్రీడలు ఆడడమే కాకుండా క్రీడలలో అత్యున్నత పదర్శన కనబర్చిన వారు వఆరి గ్రామానికే కాకుండా దేశానికి మంచి పేరు తెచ్చేవిధంగా తీర్చి దిద్దాల్చిన అవసరం వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఎంతైన ఉందని అన్నారు.తదనంతరం తెలంగాణ జట్టుకు ఎంపిక వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.