republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 January 2022, 1:52 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు 58 కరోనా కేసులు నమోదు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతంగా సంక్రమిస్తుంది. జిల్లాలో సోమవారం 2437 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 58 మందికి పాజిటివ్ గా తేలింది. మరో 79 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని, 15 మందిని డిశ్చార్జి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో 186 మంది కరోనా పాజిటివ్ క్రియాశీల బాధితులు ఉండగా, వీరిలో 172 మంది హోమ్ ఐసోలేషన్ లో 14 మంది రిమ్స్ ఐసోలేషన్ లో చికిత్సలు పొందుతున్నారని పేర్కొన్నారు.