ఇచ్చోడా మండలం సాత్ నెంబర్ గ్రామం వద్దా ఘటన…
Thank you for reading this post, don't forget to subscribe!
కొనసాగుతున్న సహాయక చర్యలు… 15 పశువుల మృతి…. పరిమితికి మించి వాహనం లో 70 కి పైగా పశువుల రవాణా…
ఇచ్చోడా : శనివారం రొజు(నేడు)ఉదయం ఇచ్చోడా మండలం లోని సాత్ గ్రామం వద్దా జాతీయ రహదారి పై అక్రమంగా పశువులు తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడింది. కంటైనర్ లో 70 కి పైగా పశువులను కుక్కి తీసుకవెళ్తున్నారు. 15 మూగజీవాలు ఈ ప్రమాదం లో మృతి చెందాయి. సాత్ నెంబర్ గ్రామం యువత కలసి బ్రతికి ఉన్న పశువులను ఆ వాహనం నుండి సురక్షితంగా బయటకు తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహనాన్ని వదిలి డ్రైవర్లు పారిపోయారు.
