republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 March 2024, 8:16 am Digital Edition : REPUBLIC HINDUSTAN

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు

హైదరాబాద్ :మార్చి 19
జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు..తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌ త‌ల‌ను అప్ప‌గించారు.

త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను రాధాకృష్ణ‌ న్‌కు అప్ప‌గించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మి ళిసై రాజీనామాను రాష్ట్ర‌ప‌ తి ద్రౌప‌ది ముర్ము ఆమోదిం చారు. పుదుచ్చెరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా రాధాకృష్ణ‌ న్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లను అప్ప‌గించారు.

పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే వర‌కు తెలంగాణ‌, పుదుచ్చెరి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించా ల‌ని రాధాకృష్ణ‌న్‌ను కోరు తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ లేఖ రిలీజ్ చేసింది.

బాధ్య‌త‌లు స్వీక‌రించిన క్ష‌ణం నుంచి నియామ‌కం అమ‌లులోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఆ రిలీజ్‌లో తెలిపింది…