republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 May 2024, 3:52 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత

సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలక పోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.