republichindustan.in
Newspaper Banner
Date of Publish : 07 May 2022, 8:20 am Digital Edition : REPUBLIC HINDUSTAN

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు : జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  డి పుల్లయ్య

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : శనివారము రోజున వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఇచ్చాడ డివిజన్ లోని ” ఇచ్చోడ , సిరికొండ , గుడిహత్నూర్ ‘ మండల ఫర్టిలైజర్ షాప్ డిలర్లతో  నకిలి పత్తివిత్తనాలు , మరియు ఆన్లైన్ లో విత్తనాల క్రయ , విక్రయాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్లయ్య  మాట్లాడుతూ నకిలీ విత్తనాల అమ్మకాలు జరిపినా ,  నకిలి విత్తనాలు  సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటూమన్నారు .

Thank you for reading this post, don't forget to subscribe!

అలాంటి వారి లైసెన్సును రద్దు చేయడంతో పాటు పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా విత్తనాల క్రయవిక్రాయాల వివరాలు నమోదు కోసం రాష్ట్ర  వ్యవసాయ శాఖ ఒక వెబ్సైట్ ను రూపొందించిదని తెలిపారు.  ఈ ఆన్లైన్ విధానం తో ప్రతి డీలర్ వద్ద లాగిన్ వివరాలు ఉంటాయని అన్నారు. ఈ ఆన్లైన్ విధానం ద్వారం నకిలీ విత్తలానాలకు చెక్ పెట్టి విత్తనాల కొరత లేకుండా చూడవచ్చని అన్నారు. 

             ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఇచ్చోడ డివిజన్ ఎడిఏ రామ్ కిషన్, ఏడిఏ రమేష్, , మండల వ్యవసాయ అధికారులు జాదవ్ కైలాష్ , ధామ రేవతి  , మండల రెవిన్యూ అధికారి అతికోద్దీన్ , ఇచ్చాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రమేష్ బాబు డిప్యుటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్ మరియు ఇచ్చోడ, సిరికొండ , గుడిహత్నూర్ మండలాల డీలర్లు పాల్గొన్నారు.