Mar 12, 2024,
వాంకిడి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన పెందుర్ చంద్రశేఖర్(34) మెట్లపై నుంచి జారిపడి గాయాలై మృతి చెందినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. ఆదివారం రాత్రి మలవిసర్జన కోసం బయటకు వెళ్ళి వస్తూ మెట్లపై నుంచి జారి పడగా బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.