republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 7:29 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

అగ్రిసెట్‌ ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

Hyderabad : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన 2025-26 అగ్రిసెట్ ఫలితాలలో పెద్ల శంకరంపేటకు చెందిన ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించింది. మంగళవారం బీఎస్సీ అగ్రికల్చర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా, తనకు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రజ్ఞ తెలిపారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించినట్లు ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

Thank you for reading this post, don't forget to subscribe!