• Other News
  • Live TV
  • పాకిస్థాన్ ఫైసలాబాద్‌లో గమ్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

    పాకిస్థాన్ ఫైసలాబాద్‌లో గమ్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

    బాయిలర్ విపరీతంగా పేలిపోవడంతో 15 మంది మృతి
    ఫ్యాక్టరీ యజమాని పరారం – మేనేజర్‌ అదుపులోకి
    ప్రమాద కారణాలు తెలియకపోవడంతో ఆందోళన

    ఫైసలాబాద్‌, 21 నవంబర్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గమ్‌ ఫ్యాక్టరీలో బాయిలర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో కనీసం 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా తెలిపింది. పేలుడు తీవ్రత అంతగా ఉండటంతో ఫ్యాక్టరీ భవనం భారీగా దెబ్బతింది. చుట్టుపక్కల ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని శిధిలాల్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. పేలుడు అనంతరం ఫ్యాక్టరీ యజమాని ఘటనాస్థలం నుంచి పరారైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు ఫ్యాక్టరీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకి గల కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో విచారణ ప్రారంభమైంది.

    పాకిస్థాన్ ఫైసలాబాద్‌లో గమ్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు - Additional Image

    గతంలోనూ ఇలాంటి ఘటనలు పాకిస్థాన్‌లో తరచూ జరుగుతున్నాయి. పంజాబ్ సీఎం మరయం నవాజ్ షరీఫ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల లోపాలే ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానిక మీడియా తరచూ ప్రస్తావిస్తోంది.

    ఇదే ఫైసలాబాద్‌లో గత ఏడాది బాయిలర్ పేలుడు జరిగి 12 మంది చనిపోగా, వారం క్రితం కరాచీలోని బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతిచెందారు.

    పాకిస్థాన్ ఫైసలాబాద్‌లో గమ్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు - Additional Image
    📰 e-Paper Clip
    Google News Follow