Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ముగ్గుల పోటీలో గెలిచిన 98 ఏళ్ళ బామ్మ

Author
Posted By HINDUSTAN
| 16 Jan 2022, 10:15 AM | తెలంగాణ


బోథ్ లో ముసలమ్మలకు ముగ్గుల పోటీలు




రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : తరుచుగా అప్పుడప్పుడు దేశంలో ఎక్కడైన ముగ్గుల పోటీలు నిర్వహిస్తే వాటిలో దాదాపు ఆడపడుచులు మహిళలు అంటే 50 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా పాల్గొంటారు.
కానీ బోథ్ పట్టణంలో ఇందుకు భిన్నంగా 50 సంవత్సరాల వయస్సు దాటి 100 సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధ మహిళలు (బామ్మలు) పోటీలో ముగ్గుల పోటీలో పాల్గొని ఆకర్షణగా నిలిచారు…






గతంలో వేసిన ముగ్గులు కాకుండా చుక్కల ముగ్గులు వేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల ఈ పోటీలను చూడటానికి పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నపిల్లలు తరలివచ్చారు.





ముగ్గుల పోటీలో పాల్గొన్న వారూ అందమైన ముగ్గులు వేశారు. అంతే కాదు నడవలేని బామ్మలు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. లంక భూమా భాయి అనే బామ్మకు 98 సంవత్సరాల వయస్సు ఉంది. ఈ వయసులో సైతం బామ్మ పోటీలో పాల్గొని బహుమతి గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ పోటీలో పాల్గొన్న మహిళలు ఇలాంటి ముగ్గుల పోటీలలో మొదటి సారిగా పాల్గొన్నామని మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోటీలో పాల్గొని ఇంతమంది ప్రజల మధ్యలో గెలుచుకోని , బహుమతులు తీసుకోవడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.