republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 January 2024, 1:36 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ శ్రావణ్ నాయక్ కే…!?

డిల్లీ ఏఐసిసి లో చక్రం తిప్పుతున్న సీనియర్ నాయకుడు శ్రవణ్ నాయక్

శ్రావణ్ నాయక్ కు గతంలో పి.సి.సి.మెంబెర్, మాజీ కేంద్ర ఉక్కు శాఖ మెంబెర్ /డైరెక్టర్ పని చేసిన అనుభవం..

ఢిల్లీ, రాజకీయ వార్తలు :
గత 25 సంవత్సరాలుగా న కాంగ్రెస్ పార్టి కి సేవలు అందిస్తున్న శ్రావణ్ నాయక్ కు ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ వస్తుందని ఆయన మద్దతుదారులు తెలిపారు. గతములో జాతీయ యుజన కాంగ్రెస్ లో సైతం పని చేసి అప్పటి జాతీయ యుజన కాంగ్రెస్ అద్యక్షుడు రాజీవ్ సాతావ్ తో కలిసి మెంబెర్ షిప్ డ్రేవ్ మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించి ప్రతిభ ను గుర్తించిన పార్టీ ఆ తరువాత రాహుల్ గాంధి చేతుల మీదుగా ఆవార్డ్ సైతం అందుకున్నారు.
యుజన కోట మరియు ఆదివాసీ కోట లో ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ తనకే (శ్రవణ్ నాయిక్ ) కేటాయించాలని ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ముఖ్యంగా పార్లమెంట్ ఇంచార్జి ఐనట్టువంటి మంత్రీ సీతక్క అస్సిసులు సైతం తనకే ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఖానాపూర్ శాసన సభ్యుడు వెడ్మ బోజ్జు మరియు జిల్లా కాంగ్రెస్ సినియర్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి కూడా శ్రవణ్ నాయిక్ పేరును ఎంపి టికెట్ కొరకు సిఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రతిపాదించారు.

Thank you for reading this post, don't forget to subscribe!