రోడ్ల మరమ్మత్తు లు వెంటనే చేపట్టండి..... : మంత్రి హారిష్

రిపబ్లిక్ హిందూస్థాన్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు మంత్రి హారిష్ రావ్ సూచించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ రెడ్డితో కలిసి అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు . జిల్లాలో మొత్తం 48 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దెబ్బతిన్న చోట మరమ్మతులు వెంటనే చేపట్టాలి. క్రాష్ ఓవర్ ఫ్లో, రీ టైనింగ్ వాల్ క్రాష్ అయిన చోట్ల వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి. వర్షాల జిల్లాలో ఎక్కడా విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలి. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ పోల్...