republichindustan.in
Newspaper Banner
Date of Publish : 23 May 2023, 5:57 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఏడుగురు పేకాట రయుళ్ళ అరెస్ట్

రూ.7690 ల నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం…

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లా వ్యాప్తంగా అసంఘిక చర్యలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు సాయంత్రం సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రణ దివ్యా నగర్లో  పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా అదిలాబాద్ పట్టణానికి చెందిన ఏడుగురు లభ్యమైనట్టు తెలిపారు. వీరి వద్దనుండి రూ.7690 నగదు,6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వీరందరిపై ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
పట్టబడ్డ వారి వివరాలు.
1) అబ్దుల్ వాజిద్ s/o జుమ్మా ఖాన్
2) అబ్దుల్ సోహెల్ s/o అబ్దుల్ ఇలియాస్
3) ప్రశాంత్ s/o హనుమాన్లు
4) అజయ్ కాంబ్లే s/o శ్యామ్ రావు
5) ఇందూర్ సాయికుమార్ s/o ఇందూర్ గంగారాం
6) అబ్దుల్ వాజిద్ s/o అబ్దుల్ సాజిద్
7) ఎస్.కె ముకురార్ s/o ఎస్.కె ఫామ్.
వీరందరూ ఆదిలాబాద్ పట్టనానికి చెందిన వారని తెలియజేశారు. ఈ ఆపరేషన్ లో సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!