రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి దండే విట్ఠల్ నామినేషన్ సందర్బంగా రేపు 11 గంటల ప్రాంతములో ఆదిలాబాద్ లోని తనిషా గార్డెన్ లో కార్యకర్తల సమావేశం ఏర్పటు చేస్తున్నారు. బోథ్ నియోజకవర్గములోని అన్ని మండలాల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్స్, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ &సొసైటీ చైర్మన్లు,డైరెక్టర్లు,రైతు బంధు&ఆత్మ చైర్మన్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తములో సమావేశానికి సమయంలోగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.
Thank you for reading this post, don't forget to subscribe!