— రెండు కోట్లకు పైగా భారీ నగదు స్వాధీనం
రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్:
పరిధిలో ముంబాయి కేంద్రంగా ఆన్ లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలాట బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసి పోలీసులు అరెస్టు చేసారు.
వీరి నుండి 2కోట్ల 5లక్షల 14వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్ బుక్స్, ఏటియం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
- మాడిశెట్టి ప్రసాద్, తండ్రి పేరు వెంకటేష్, వయస్సు 40, విజయనగర్ కాలనీ, హన్మకొండ.
- అభయ్ విలాస్ రావు పెట్కర్, తండ్రి పేరు విలాస్ రావు పెట్కర్, నివాసం చోరీయా టౌన్ షిప్, వాని,యవత్మాల్ జిల్లా, మహరాష్ట్ర.

వివరాలలోకి వెళితే…
ఈ ఆన్లైన్ బెట్టింగ్ బుకీల అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఐ పి యస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి …. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు మాడిశెట్టి ప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ హఫీజ్ పేటలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని రెడీమెడ్ బట్టల వ్యాపారం నిర్వహించేవాడు. ఈ బట్టల వ్యాపారం ద్వారా తన కుటుంబ పోషణ కష్టం కావడంతో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు హఫీజ్ పేటలో మరికొద్ది మంది స్నేహితులతో కలిసి 2016 నుండి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు. ఈ బెట్టింగ్ ద్వారా నిందితుడు పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించడంతో పాటు 2018 సంవత్సరంలో తన స్నేహితుల ద్వారా స్మార్ట్ ఫోన్లో అన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలాట బెట్టింగ్ నిర్వహించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రసాద్ ముంబాయి కేంద్రంగా అన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ నిర్వహకుడు మరోనిందితుడు అయిన అభయ్ తో పరిచయం అయింది. ఈ పరిచయం ద్వారా నిందితుడు ప్రసాద్ కి అన్లైన్ బెట్టింగ్ పై పూర్తిస్థాయిలో అవగాహన కలగడంతో పాటు, అభయ్ నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ద్వారా నిందితుడు ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా నియమించబడ్డాడు.

దీనితో ఆన్లైన్ లో బెట్టింగ్ లో పాల్గొనేవారు ముందుగా అన్లైన్ ద్వారా గాని వ్యక్తిగతంగా గాని డబ్బు చెల్లించిన వ్యక్తులకు అభయ్ నుండి నిందితుడికి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్లను వాట్సప్ ద్వారా బెట్టింగ్ లో పాల్గొనే వ్యక్తులకు అందజేసేవాడు. వీటి ద్వారా ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ లో పాల్గొనేవారు.
ఈ బెట్టింగ్ లో గెలుపొందిన వ్యక్తులకు పందెం కాసిన డబ్బుకు రెట్టింపు డబ్బును కమిషన్ మినహాయించి నిందితుడు ప్రసాద్ మిగితా డబ్బును అందజేసేవాడు.
ఈ విధంగా రోజు వారిగా జరిగిన లావాదేవీల అనంతరం వచ్చిన లాభంలో నిందితుడు ప్రసాద్ వాటాలను అనసరించి బెట్టింగ్ వెబ్ సైట్ నిర్వహకుడు అభయ్ కు అందజేసేవాడు. నిందితుడు ప్రసాద్ ఈ డబ్బు లావాదేవీలను నిర్వహించేందుకుగాను బినామీ పేర్లపై బ్యాంక్ ఖాతాలను నిర్వహించేవాడు. ముఖ్యంగా అన్లైన్ బెట్టింగ్ వ్యవహారం, వెబ్ సైట్ నిర్వహణ మొత్తం నిందితుల చేతుల్లో వుండటంతో మూడుముక్కల పేకాట బెట్టింగ్ సమయంలో తక్కువ మొత్తం పందెం పెట్టిన వారిని ముందుగా గెలిపించి వారితో ఎక్కువ మొత్తంలో డబ్బు పందెం కాసేవిధంగా ప్రోత్సహించేవారు. ఇలా ఎక్కువ డబ్బును పందెం కాసినప్పుడు వారిని ఓడిపోయే విధంగా నిందితులు మోసం చేసేవారు.
ఈ క్రమంలోనే నిందితుడు మరో ఇద్దరు నిందితులతో కల్సి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 2019లో సైబరాబాద్ కమిషనరేట్ కు చెందిన చందానగర్ మరియు రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన అనంతరం నిందితుడు హైదరాబాద్ లో తిరిగి అన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు గుర్తిస్తారని తన అత్తగారు నివాసం వుంటున్న హన్మకొండకు నిందితుడు ప్రసాద్ మకాం మార్చాడు.
హన్మకొండ కేంద్రంగా చేసుకొని నిందితులు ఐపిఎల్, టి20 వర్డల్ కప్ తో పాటు మూడు ముక్కల పేకాట ఆన్లైన్ బెట్టింగ్ ను జోరుగా నిర్వహిస్తూ ప్రజలను మోసం చేయడంతో పాటు ఈ బెట్టింగ్ ద్వారా నిందితుడి చేతికి వచ్చిన డబ్బును బినామీ పేర్లపై వున్న బ్యాంకు ఖాతాల్లో జమచేయడంతో పాటు వివిధ స్థిరాస్తులను కొనుగోలుచేసాడు. ఈ బెట్టింగ్ లో మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులో నిందితులపై కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసును పోలీసులు నమోదు చేసుకొని సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా గారి అధ్వర్యంలో కెయూసి మరియు సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా కలిసి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడం జరిగింది.
ఈ నిందితుల్లో ఒకడైన అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకోనేందుకుగాను ఈరోజు ఉదయం మరో నిందితుడు ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా కెయూసి పోలీసులకు సమాచారం రావడంతో ఇన్స్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బ్యాంక్ పాసుబుక్కులు, ఏటియం కార్డులు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, కెయూసి ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఎస్.ఐ సంపత్, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్ళు అశోక్, మధు, జగదీష్, కమాలకర్ లను పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments