republichindustan.in
Newspaper Banner
Date of Publish : 05 February 2024, 12:41 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మంకీ ఫీవర్ కలకలం..

ప్రపంచదేశాల మొత్తాన్ని గడ గడ లాడిస్తున్న వైరస్ లు…మొన్న కరోన వైరస్…తో అతలాకుతలం..ఇప్పుడు కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ఇద్దరు మృతి

Thank you for reading this post, don't forget to subscribe!

కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది.

రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది.

శివమొగ్గ జిల్లా హొసనగర తాలుకాకు చెందిన యువతి (18) ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు (79) ఈ వైరస్‌తో మృతిచెందారు.

ఇక మొత్తంగా ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో 3 కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కీటకాలు కోతులను కుట్టిన తర్వాత తిరిగి మనిషిని కుడితే ఈ వైరస్ వస్తుందని వారు వివరించారు.