Thank you for reading this post, don't forget to subscribe!
మంచిర్యాల జనవరి 11 ( రిపబ్లిక్ హిందుస్థాన్) :
సిసిసి కార్నర్ వద్ద మంగళవారం ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు అప్రమత్తమై అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. కోటపల్లి లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్, పోలీస్ సిబ్బంది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి కిడ్నాప్ కోసం ప్రయత్నం చేసిన ఆటో డ్రైవర్ తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కి తరలించి, కేసు నమోదు చేసుకొని అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. చాకచక్యంగా వ్యవహరించి అమ్మాయిని అతి తక్కువ సమయంలో పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్సై వెంకట్,పోలీస్ సిబ్బందికి అమ్మాయి తల్లిదండ్రులు,ప్రజలు అభినందనలు తెలిపారు.