Adilabad: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం టూటౌన్లో వివరాలను వెల్లడించారు.[view_clip]
Thank you for reading this post, don't forget to subscribe!
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన అబ్దుల్ రషీద్ అలియాస్ రషీద్ ఖాన్ పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. పోలీసులు ఓ వ్యక్తిని కొట్టినట్లు ఉన్న ఈ వీడియో పోస్టు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైన శాంతిభద్రతలు, విద్వేశాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూప్ అడ్మిన్లు ఇలాంటి పోస్టులు పెట్టకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
[view_clip