republichindustan.in
Newspaper Banner
Date of Publish : 13 October 2022, 4:29 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

పశు తోళ్ళ లారీ …

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడా మండలం లో ఓ లారీ విషయం లో కొద్దీ సేపు హైడ్రామా నడిచింది. ఓ లారీ అనుమానస్పదంగా కనిపియ్యడం తో ఇచ్చోడా స్థానికులు బీజేపీ నాయకులకు సమాచారం అందించారు. బీజేపీ నాయకులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు లారిని అదుపులో తీసుకుని మండల కేంద్రం లోని మార్కెట్ యర్డుకు తరలించారు. ఇచ్చోడా సిఐ ఎం నైలు, ఎస్సై ఉదయ్ కుమార్ లు తెలిపిన వివరాల ప్రకారం పశు తోళ్ల లోడ్ తో TS 07
UB5104 నెంబర్ గల లారీ కర్ణాటక నుండి ఉత్తర్ ప్రదేశ్ తోళ్ల పరిశ్రమకు పశు తోళ్లను తీసుకెళ్లుతున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ వద్ద అన్ని రకాల రవాణా సరుకు అనుమతి పత్రాలు ఉన్నట్లు తెలిపారు.