republichindustan.in
Newspaper Banner
Date of Publish : 08 January 2024, 2:01 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆడపులుల ఘర్షణ.. ఓ పులి మృతి:

రెండు ఆడపులుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ పులి మృతి చెందింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో రెండేళ్ల వయసున్న రెండు పులులు ఆవాసం కోసం కొట్లాడుకున్నాయి. దీంతో ఓ ఆడపులి తీవ్రగాయాలపాలై చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ ఘటన జరిగి 3, 4 రోజులవుతుందని తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!