రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్: మండలం లోని మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కొలరీ గ్రామంలో ఒక నిరుపేద వ్యక్తి కటికే జనార్దన్ కిరాణా దుకాణం శుక్రవారం రోజు సాయంత్రం 6:30 గంటలకు పైన ఉన్న విద్యుత్తు తీగలు గాలికి ఒక దానికి ఒకటి అతుక్కుపోవడం వలన నిప్పు రవ్వలు కిరాణా షాప్ పై పడటం వలన అధిక మొత్తంలో కిరాణా షాపు అగ్నిలో కాలిపోవడం జరిగింది కిరాణా షాపులో ఉన్న సరుకులతో సైతం కాలిపోయయయ్ బాధితుడు అప్పు సప్పు చేసి పొట్ట కూటి కోసం ఒక ఉపాధి అనుకోని జీవనం సాగిస్తుంటే విద్యుత్తు వలన ఏర్పడిన మంటలతో కిరాణా కొట్టు యజమాని పూర్తిగా నష్టం పోవడం జరిగింది సదరు బాధితుడు తమను ప్రభుత్వం ఆర్థికం గా ఆదుకోవాలని ప్రభుత్వన్ని కోరుతున్నారు.