republichindustan.in
Newspaper Banner
Date of Publish : 05 October 2021, 5:49 pm Editor : REPUBLIC HINDUSTAN

కరాటే క్రీడాకారిణి కి సన్మానం….

రిపబ్లిక్ హిందూస్థాన్, ఇంద్రవెల్లి : అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి గ్రామానికి చెందినటువంటి దాహికాంబ్లే శిరీష అనే క్రీడాకారిణి ని సన్మానించారు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఇటీవల జరిగిన కరాటే పోటీలో పాల్గొని బ్లాక్ బెల్ట్ -ll డౌన్ లో గెలిచి ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నా సందర్భంగా సభ్యులు శిరీష ను సన్మానించారు.

ఈ సందర్బంగా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాబాసాహెబ్ మరియు జనరల్ సెక్రటరీ నరహరి కాంబ్లే అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వంచిత్ బహుజన్ జిల్లా అధ్యక్షులు సందీప్ దాండగే, ఉపాధ్యక్షులు నాగసేన్ మాన్కర్, వసీమ్, అనిల్, రాహుల్ లాండగే, శివాజీ కాంబ్లే,మహేందర్ లాండగే మరియు తుకారాం జీవనే తదితరులు పాల్గొన్నారు.