republichindustan.in
Newspaper Banner
Date of Publish : 20 December 2021, 3:08 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

జిపి సమస్యల పై కలెక్టర్ కు వినతిపత్రం

గ్రామపంచాయతీ లో నెలకొన్న సమస్యలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ కి విస్తరిస్తున్న సర్పంచ్ తొడసం భీం రావ్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ కలెక్టరేట్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి సర్పంచ్ తొడసం భీం రావ్ సోమవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి గ్రామపంచాయతీ లో నెలకొన్న సమస్యల పై వినతిపత్రం సమర్పించారు. ఆదివారం రోజు కామగిరి గ్రామం నుండి పాదయాత్ర గా వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నిధులు లేక అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు . అధికారులు నిర్లక్ష్యం వల్ల గ్రామపంచాయతీ లో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. గ్రామపంచాయతీ లో నెలకొన్న సమస్యలను వ్రాత పూర్వకంగా కలెక్టర్ కు అందించారు.

Thank you for reading this post, don't forget to subscribe!