ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ :ఆదిలాబాద్ ఐటీఐ ప్రభుత్వ కళాశాలలో 2021-2022 సం,,కు గాను మొదటి, రెండు, మూడు, నాలుగు విడుతలలో మిగిలిపోయిన సీట్లను ఐదో విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత గారు తెలిపారు. ప్రవేశం కొరకు విద్యార్థులు ముందుగా iti.telangana.gov.in వెబ్ సైట్ లో ఈనెల 17 నుండి 21 మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9493535378 నెంబర్ కు సంప్రదించాలన్నారు.