republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 January 2022, 9:50 am Digital Edition : REPUBLIC HINDUSTAN

అవినీతిలో ఘనం … అభివృద్ధి లో శూన్యం …

ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ తీరు…
నూతనంగా ఇల్లు కట్టుకోవలంటే లంచం ఇవ్వాల్సిందే…
ఉద్యోగస్తులకు తప్పని తిప్పలు….
నూతన ఇంటి నిర్మాణం కోసం అనుమతి కొరకు 40 నుండి యాభై వేల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం….

Thank you for reading this post, don't forget to subscribe!

పేరుకే పెద్ద గ్రామ పంచాయితీ కోట్లల్లో ఆదాయం నిధులకు డోకా లేదు కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం గ్రామ పంచాయతీ పరిధి అదిలాబాద్ జిల్లాలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదు.

మురుగు కాలువలు లేవు కోట్లల్లో నిధులు మాత్రం కరిగిపోతున్నాయి తాజాగా నూతనంగా ఇల్లు కట్టుకోవాలంటే గ్రామ పంచాయతీ అధికారులకు సర్పంచ్ ఇవ్వాల్సిందే అయితే నిధులు పుష్కలంగా ఉన్నా తమ కాలనీల్లో అభివృద్ధి జరగడం లేదని గతంలో పలు కాలనీవాసులు పెద్దగా ఫ్లెక్సీలు చేసి తాత్కాలిక బస్టాండ్ మరియు గ్రామ పంచాయతీ ముందర సంఘటనలు ఉన్నాయి తమ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు రోడ్డెక్కిన సంఘటనలు ఉన్నాయి అయినా కూడా గ్రామపంచాయతీ పాలకవర్గం లో ఎలాంటి మార్పు కనబడడం లేదు తాజాగా మీరు చిత్రంలో చూస్తున్నట్టు వంటివి టీచర్స్ కాలనీలో మురికినీరు రోడ్డుపై ఏరకంగా ఉన్నదో చూడవచ్చు దీన్ని బట్టి మీరు అంచనా వేయొచ్చు మిగతా ప్రదేశాలలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇళ్లపై లేదా నూతన ఇళ్లపై రుణాలు పొందాలంటే గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగుల నుండి 50 నుండి 70 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం….

పూర్తి కథనం మీ రిపబ్లిక్ హిందుస్థాన్ దినపత్రిక లో