రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరద ఉదృత్తి వల్ల సిరిచేల్మా వైపు వెళ్లే రోడ్డు పై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న బ్రిడ్జి తెగిపోయి ఇచ్చోడా కు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్ మండలం ధన్నూర్ వాగు ఉదృతంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రికి వెళ్లే దారి లేక గర్భిణీని తరలిస్తున్న అంబులెన్స్ సైతం కల్వర్ట్ తెగిపోవడం తో ఆగిపోయింది.