రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: సాత్నాల పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం కారణంగా ఈ రోజు (19.08.2025) సాత్నాల ప్రాజెక్ట్ గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేయబడుతుందనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగం నం.2, ఆదిలాబాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం 1400 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్ లోపలికి వచ్చుచుండగా, అదే పరిమాణంలో (1400 క్యూసెక్కులు) నీటిని దిగువకు వదలడం జరుగుతుంది.
అందువల్ల నదీ పరివాహక ప్రాంతం (దిగువన) ఎవరూ ప్రవేశించకూడదని విజ్ఞప్తి చేశారు.