ఇచ్చోడ , రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ , తలమద్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను , మెడిగూడా ఆశ్రమ పాఠశాలను , తలమద్రి , పాఠశాలలు జిల్లా విద్యాధికారి ప్రణీత తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో విద్యనభ్యసిస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలున్నాయా అని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నోటు పుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నరసయ్య మండల విద్యాధికారి రాథోడ్ ఉదయ్ రావ్ , మెడిగూడా ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సయ్య మరియు పాఠశాలల బోధన సిబ్బంది ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments