రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలంలోని దాబా కె గ్రామములో ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్న 65 వ అశోక విజయ దశమిని పురస్కరించుకుని ధమ్మ చక్ర ప్రవర్ధన్ కార్యక్రమానికి బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావును డాబా కె గ్రామస్తులు ఆహ్వానించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
అదిలాబాద్ లోని తన నివాసములో కలసి జేత్వాన్ బుద్ధ వివహర్ సమితి దాబా కె తరుపున గ్రామస్థులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమములో దాబా కె ఉప సర్పంచ్ గాయకాంబ్లీ గణేష్, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా, దాసరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..