republichindustan.in
Newspaper Banner
Date of Publish : 16 September 2022, 3:00 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

షేవింగ్‌కు వచ్చిన యువకుడి గొంతు కోసేసిన సెలూన్ షాప్ ఓనర్

సెలూన్ షాప్ ఓనర్ ను కొట్టి చంపినా మృతుని బంధువులు

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, వేబ్ డెస్క్ : మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలుక బోధిది గ్రామంలో జరిగిన హత్యాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ సెలూన్ షాప్ లో గడ్డం గీయించుకునేందుకు వచ్చిన యువకుడిని సెలూన్ నిర్వాహకుడు సెలూన్ కత్తితో గడ్డం గిస్తున్నట్లు నటించి గొంతు కోసి నరికి చంపగా, ప్రతీకారంగా ఆ యువకుడి బంధువులు సెలూన్ నిర్వాహకుడిని చితకబాది చంపేసిన ఘటన జరిగింది. ఈ ఘటన నాందేడ్ జిల్లాలోని బోధిడి లో చోటుచేసుకుంది. కిన్వాట్ తాలుక బోధిడి గ్రామంలో అనిల్ షిండేకి సెలూన్ ఉంది. సాయంత్రం గ్రామానికి చెందిన వెంకట్ దేవకర్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ సెలూన్‌లో షేవింగ్ చేసుకునేందుకు వచ్చాడు. గడ్డం గిస్తున్నట్లు నటించిన అనిల్ షిండే యువకుడి పీక కోసి చంపేశాడు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఉండడంతో పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.