వెబ్ డెస్క్ : ఆఫ్రికా నైజీరియాలోని బెన్యూ రాష్ట్రం ఉమోగిడిలో కొందరు దుండగులు నరమేధానికి పాల్పడ్డారు. ఓ మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి సహా 47 మంది మరణించారు. పంటలు సమృద్ధిగా పండే బెన్యూలో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న భూ వివాదమే కాల్పులకు కారణమని అధికారులు భావిస్తున్నారు. పశువుల కాపరులే కాల్పులు జరిపారని అనుమానిస్తున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!