🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 March 2025, 5:31 pm Posted by : HINDUSTAN

రైతన్నకు తీరని నష్టం... లక్షన్నర రూపాయల మేకలు,  ఆవులు మృతి

News Image



రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలం సాత్ నెంబర్ గ్రామంలో రాథోడ్ గోపాల్ అనే రైతుకు చెందిన లక్షన్నర రూపాయలు విలువ చేసే 7 మేకలు , 2 ఆవులు ఆకస్మికంగా మృతి చెందాయి. కూతురు పెండ్లి కోసం రూపాయి రూపాయి కుడబెట్టుకుని పోషించుకుంటున్న పశువులు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ రైతు కంటతడి పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం అధికారులు నష్టపరిహారం ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటూన్నాడు.

🏠 Home