🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 10 March 2025, 7:31 am Posted by : HINDUSTAN

Breaking News : ఇచ్చోడ బాలికల గురుకులంలో విద్యార్థిని అనుమానాస్పద  మృతి..!?

News Image

అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా  ఇచ్చోడాలో మండల కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థిని చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది.? అయితే గుట్ట చప్పుడు కాకుండా పాఠశాల యజమాన్యం మృతి చెందిన విద్యార్థినీ యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాలిక శవాన్ని తీసుకెళ్ళాలని చెప్పినట్లు సమాచారం.. !?బజార్ హత్నూర్ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన రాజేశ్వర్ యొక్క కూతురు లాలిత్య ( 13) గురుకులం ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలిక చనిపోయిన విషయం ఫోన్ చేసి చెప్పడంతో వారు అక్కడకి చేరుకున్నాంక , కుటుంబ సభ్యులు ఎలా చనిపోయింది అని అడుగుతున్నారు. అయితే మృత దేహం తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులకపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.




మృతురాలి తండ్రి ( చిత్రంలో ఇచ్చోడ సీఐ)







దీని పై పూర్తి సమాచారం  తెలియాల్సి ఉంది.






🏠 Home