🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 22 November 2024, 8:29 am Posted by : HINDUSTAN

CCI : చైల్డ్ లేబర్ తో పనులు చేయిస్తున్న సిసిఐ అధికారులు

News Image

రాణి జిన్నింగ్ లో బాలల చేత పత్తి వాహనాలు ఖాళీ చేయిస్తున్న వైనం..




రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ ను నిర్ములించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇచ్చోడ లో సిసిఐ అధికారులు మాత్రం దీనికి భిన్నమంగా వ్యవహరిస్తూన్నారు.





చదువు తో పాటు ఆడుకోవాల్సిన పసి పిల్లల చేత పత్తి వాహనాలు ఖాళీ చేయిస్తున్నారు. ఇచ్చోడలో రాణి జిన్నింగ్ లో పసి పిల్లలు చేత పత్తి వాహనాలు ఖాళీ చేయిస్తున్న దృశ్యం రిపబ్లిక్ హిందుస్థాన్ కామెరాకు చిక్కింది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పై  ,  బహిరంగంగా పసి పిల్లల చేత పనిచేయిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 




అధికారులు బాద్యులైన వారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడలిసందే .






🏠 Home