🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 March 2024, 12:58 pm Posted by : HINDUSTAN

అమిత్ షా కి ధన్యవాదాలు తెలిపిన గాజుల రాకేష్







రిపబ్లిక్ హిందుస్థాన్, హైదారాబాద్ :




తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 ను ఇకపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా గారికి బోథ్ అసెంబ్లీ యువమోర్చా ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్ ధన్యవాదాలు తెలియచేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులందరికీ సరైన గౌరవం దక్కిందని, ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం గురించి తెలిసేందుకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.

🏠 Home