ఏడుగురు పేకాట రయుళ్ళ అరెస్ట్
రూ.7690 ల నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం...
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :జిల్లా వ్యాప్తంగా అసంఘిక చర్యలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు సాయంత్రం సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రణ దివ్యా నగర్లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా అదిలాబాద్ పట్టణానికి చెందిన ఏడుగురు లభ్యమైనట్టు తెలిపారు. వీరి వద్దనుండి రూ.7690 నగదు,6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వీరందరిపై ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.పట్టబడ్డ వారి వివరాలు.1) అబ్దుల్ వాజిద్ s/o జుమ్మా ఖాన్2) అబ్దుల్ సోహెల్ s/o అబ్దుల్ ఇలియాస్3) ప్రశాంత్ s/o హనుమాన్లు4) అజయ్ కాంబ్లే s/o శ్యామ్ రావు5) ఇందూర్ సాయికుమార్ s/o ఇందూర్ గంగారాం6) అబ్దుల్ వాజిద్ s/o అబ్దుల్ సాజిద్7) ఎస్.కె ముకురార్ s/o ఎస్.కె ఫామ్.వీరందరూ ఆదిలాబాద్ పట్టనానికి చెందిన వారని తెలియజేశారు. ఈ ఆపరేషన్ లో సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.