🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 April 2022, 10:16 am Posted by : HINDUSTAN

జామిడీ విడిసి అధ్యక్షుడిగా హారన్ మారుతీ




రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండలం లోని జామిడి గ్రామం లో శనివారం రోజు గ్రామస్తులు నూతన గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు అందరూ కలిసి హారన్ మారుతి పటేల్ ను విడిసి అధ్యక్షుడిగా ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులలో ఉపాధ్యక్షుడిగా నర్వాడే గంగాధర్, ప్రధాన కార్యదర్శి పిలవన్ కిషన్, కోశాధికారి బి అనిల్, సలహాదారుడు రాథోడ్ సుభాష్, కార్యదర్శి వాణఖేడే అవినాష్, సంయుక్త కార్యదర్శి చిట్యాల మహేందర్ లను ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

🏠 Home