republichindustan.in
Newspaper Banner
Date of Publish : 13 January 2024, 2:43 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు : పూచీకత్తు సమర్పించిన చంద్రబాబు

తాడేపల్లి:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం ,ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే సీఐడీకి పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్ పేపర్లను చంద్రబాబు నాయుడు సమర్పించారు. కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం ,ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు ఒకేసారి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.