రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామపంచాయతీ రజక సంఘం అధ్యక్షులు సాగర్, గంగాధర్, స్వామి లు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కు సహకరించాలని బోథ్ ఎంపిపి శ్రీనివాస్ ను కలిశారు. స్పందించిన ఎంపిపి వెంటనే పది వేల రూపాయలు నగదు ఆర్థిక సహాయం గా అందజేశారు. ఈ సందర్భంగా విరవనిత చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు ఆర్ధిక సహాయం చేసిన ఎంపిపి ని పలువురు అభినందించారు.
