– రైతాంగానికి వెన్నెముక కేంద్ర పథకాలు
– ఈ ఏడాది ఎరువులపై 60వేల కోట్ల సబ్సిడీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
చెమటచుక్కనే పెట్టుబడిగా శ్రమనే ఆయుధంగా చేసుకుని ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మోధి ప్రభుత్వం అండగా నిలుస్తుందని
బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జి గాజుల రాకేష్ అన్నారు.
ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరించారు.

మోడీ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్నా పథకాలన్ని రైతుల మేలుకోరేటివే — గాజుల రాకేష్ , బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సంవస్తరానికి రెండు వేల చొప్పున మూడు సార్లు మొత్తం ఆరువేలు అందిస్తూ రైతులకు కొంత పెట్టుబడి సాయం కింద ఆర్థిక బరోసా ఇస్తుందని అన్నారు.
ఫసల్ భీమ యోజన
వర్షాలు,తుఫాన్,గాలివాన,వడగండ్లు,వరదలు వంటి ప్రకృతి విపత్తులతో ఎదురైన నష్టం నుండి రైతుకు ఉపశమనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ముందుగా ప్రీమియం చెల్లించుకున్న రైతులకు దీనిద్వారా పంట నష్టపరిహారం అందివ్వనుందని తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్
రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. రైతులకు సమయానికి రుణం లభిస్తుంది. దీనిని నాబార్డ్ ద్వారా అందిస్తారు. ప్రస్తుతం ఇది పిఎం కిసాన్ సమ్మన్ నిధికి అనుసంధానం చేశారు.
పరం ప్రగతి కృషి వికాస్ యోజన
ఆర్గానిక్ ఫర్మింగ్ రైతులకు అండగా వారికి ఎంపవర్మెంట్ కోసం దీనిని ప్రవేశ పెట్టారు. దీని ద్వారా ఆర్గానిక్ ఫర్మింగ్ చేసే రైతులకు ఒక సీజన్ కి ఎకరాకు 25 వేల రూపాయలు సబ్సిడీ అందిస్తుంది.
వీటితో పాటుగా ఉపాధిహామీ నిధుల ద్వారా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు, బంజరు, బీడు భూముల అభివృద్ధి, కంపోస్ట్ ఎరువు గుంతలు, రైతు కల్లాలు, తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యంతో రైతువేదికలు నిర్మించి రైతులను అభివృద్ధి బాటలోకి తీసుకువస్తున్నారు. అంతే కాకుండా ఏటేటా పంటలకు మద్దతు ధరను ప్రకటిస్తూ ముందుకు వెళ్తుంది.
ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు ఫర్టిలైజర్స్ పై అత్యధిక సబ్సిడీని ప్రకటిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
సుమారు 60939.23 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు ప్రధాని మోధి ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపి0ది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవస్థరంలో తొలి ఆరు నెలలకు ఈ నిధులను సబ్సిడీ కోసం ఖర్చు చేసేందుకు అంగీకరించింది. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్ లో ఫర్టిలైజర్స్ ధరలు భారీగా పెరిగినప్పటికీ రైతులపై బారం మోపకుండా వాటిపై అధిక సబ్సిడీ కల్పిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ” న్యూట్రియెంట్స్ బేస్డ్ సబ్సిడీ ఖరీఫ్ 2022 ” స్కీమ్ కింద ఈ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వo ఇవ్వనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ సబ్సిడీ వర్తివ్వనుంది.
డీఎపి బస్తాపై రూ 2501 సబ్సిడీ
ప్రస్తుతం డిఏపి బస్తా అసలు దర 3851 ఉండగా కేంద్ర ప్రభుత్వం 2501 రూపాయల సబ్సిడీ ఇస్తు రైతుకు 1350 రూపాయలకే అందివ్వనుంది.
డీఏపి తో పాటుగా నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్,సల్ఫర్ లాంటి పోషకాలతో కూడిన ఎరువులను సబ్సిడీ కింద ఇవ్వనుంది. దీంతో అన్ని ఎరువులపై 100 నుండి 400 ల రూపాయల దర తగ్గే అవకాశం ఉంది . నీరుడు తో పోలిస్తే ఈ ఏడు 4 వేల కోట్ల సబ్సిడీ పెంచింది.
నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉందని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments